‘న్యూఢిల్లీ: త్రివిధ బలగాల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ, భారత సేనలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఈ ఎర్రకోటనుంచి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను. ఇండియాకు రక్షణ బలగాల ప్రధానాధికారి ఉండబోతున్నారు. దీనితో బలగాలు మరింత ప్రతిభావంతంగా పని చేస్తాయి అని ప్రధాని అన్నారు.
రక్షణ బలగాల ప్రధానాధికారి పోస్టు ఉండాలని కార్గిల్ యుద్ధం తర్వాత ఒక కమిటీ మొదటిసారిగా సిఫారసు చేసింది. మోదీ మొదటి ప్రభుత్వంలో రెండేళ్ల పాటు రక్షణ మంత్రిగా పని చేసిన మనోహర్ పరికర్ ఆ సిఫారసును గట్టిగా సమర్ధించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మధ్య మరింత సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని కార్గిల్ యుద్ధం సందర్భంగా గమనించారు.
అమెరికాలో ఈ విధమైన పదవి ఉంది. త్రివిధ బలగాల ప్రధానాధికారుల్లో ఎవరు సీనియర్ అ యితే వారు చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని అలంకరిస్తారు.