లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాల విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. చదువు నేర్పే టీచర్పైనే దాడి చేశారు. రాయ్బరేలీలోని గాంధీ సేవా నికేతన్ చైల్డ్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు మమతా దూబే అనే టీచర్పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇది చూసిన వారంతా విద్యార్థుల ప్రవర్తించిన తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH A child welfare official, Mamata Dubey, was thrashed by students at Gandhi Sewa Niketan in Raebareli, yesterday. pic.twitter.com/ZCBGJeZ8Z3
— ANI UP (@ANINewsUP) November 12, 2019
సోమవారం (నవంబర్ 11, 2019) ఆశ్రమ పాఠశాలలో చదువుకునే కొంత మంది విద్యార్థులకు మమతా పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూంకు వెళ్లింది. అక్కడ కొంత మంది విద్యార్థులు ఆమె చుట్టూ చేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆమెతో వాదనకు దిగారు. ఒక విద్యార్థి ఆమె హ్యాండ్ బ్యాగును విసిరేశాడు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. అయితే, మళ్లీ అదే విద్యార్థి ప్లాస్టిక్ కుర్చీ చేతిలోకి తీసుకొని ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. ఈ ఘటన అంతా క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
స్కూలు మేనేజర్తో విభేదాలు ఉండటం వల్లే విద్యార్థులను తనపై దాడికి ఉసిగొల్పినట్టుగా టీచర్ మమతా దూబే ఆరోపించారు. పాఠశాల మేనేజర్ తనతో గొడవపడి తనను విధుల నుంచి తొలగించాడని, అయితే, మాజీ జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ జోక్యం చేసుకుని మళ్లీ తనను ఉద్యోగంలో చేరేలా చేశారని బాధిత ఉపాధ్యాయురాలు మమతా దూబే తెలిపారు. నేహా శర్మ ఇక్కడ్నుంచి బదిలీ కావడంతో సదరు మేనేజర్ మళ్లీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ఈ దాడి వెనుక కూడా అతని హస్తం ఉందని మమత ఆరోపించారు. ఇంతకుముందు తనను విద్యార్థులు వాష్ రూంలో బంధించారని అధికారులకు ఫిర్యాదు చేస్తే.. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటారని.. వారు ఏదనుకుంటే అదే చేస్తారని అధికారులు చెప్పారని వాపోయారు. తనపై దాడి ఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని మమత దూబే తెలిపారు.
Mamata Dubey:I was locked up in washroom at Gandhi Sewa Niketan by the children, when I talked to authorities about it,they said that children can do whatever they want.When I went there after 2 days,I was beaten by the children.I also went to complain to district administration. https://t.co/I67GEVOWPA pic.twitter.com/rFjCjTtFLi
— ANI UP (@ANINewsUP) November 12, 2019