తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలలో ఎ.ఎన్.ఆర్ ఒకరు. ఆయన పేరు మీద ఎ.ఎన్.ఆర్ నేషనల్ అవార్డ్స్ను ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2018లో ఈ అవార్డును దివంగత నటి శ్రీదేవికి ఇవ్వగా 2019లో నటి రేఖ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ “నేను అన్నపూర్ణ స్టూడియోస్లో 10 ఏళ్లు గడిపాను. మళ్లీ ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో నాగేశ్వరరావుగారిని కలిసినప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పారు. మనం ఏం తినాలి? మన మైండ్లో ఎలాంటి అంశాలను ఎక్కించుకోవాలి? అనే విషయాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలనేది చెప్పారు. వాటినే పాటిస్తున్నాను. అవి నా కెరీర్కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మా అమ్మగారి చివరి కోరిక ప్రకారం ఓ తెలుగు సినిమాలో నటించాను. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. త్వరలో తెలగు స్పష్టంగా నేర్చుకుని తెలుగు సినిమా చేస్తాను“ అన్నారు
previous post