సంబిత్ పాత్రా వీడియోపై గందరగోళం
ఉజ్వల పథకం అమలుపై ప్రశ్నలు
పూరి: బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా ట్వీట్ చేసిన వీడియో గందరగోళం సృష్టిస్తోంది. దారిద్ర్యానికి దిగువన ఉన్న గ్రామీణ కుటుంబాల ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఉజ్వల యోజనను ప్రవేశపెట్టింది. 2016లో ప్రారంభించిన ఈ పథకం విజయవంతం అయ్యిందని చెబుతోంది. సంబిత్ పాత్రా ఒడిశాలోని పూరీలో ఓ ఇంటికి వెళ్లి.. అక్కడ వాళ్లింట్లో భోజనం చేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. అక్కడినుంచే ఆయన లోక్ సభకు పోటీ చేస్తున్నారు. నేల మీద బాసింపటం వేసుకుని కూర్చుని, అరిటాకులో తింటున్నట్లు అందులో ఉంది. కానీ, పక్కనే ఒక మహిళ మట్టి పొయ్యి మీద వంట చేస్తుండటం అందరికీ కనిపించింది. ఆయన ఒరియాలో చేసిన ట్వీట్ అర్థం ఇలా ఉంది.. ‘‘ఇది నా ఇల్లు. నా తల్లి స్వయంగా వంట చేసి నాకు అన్నం పెడుతోంది. నేను ఆమెకు నా సొంత చేతులతో అన్నం కలిపి పెట్టాను. మానవసేవే మాధవ సేవ అని నాకు తెలుసు’’ అని ఆయన రాశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, తమ పథకం 7 కోట్ల కుటుంబాలకు చేరిందని ప్రభుత్వం చేసిన ప్రకటనను పలువురు ప్రశ్నించారు. ఈ పథకంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తున్న వేగం చూస్తే 2020 నాటికి మొత్తం 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా ఉందని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. కానీ గ్యాస్ సిలిండర్లకు సగటున రూ. 800 వరకు పెట్టాల్సి వస్తోంది. (ఇందులో కొంత.. సుమారు 350-400 సబ్సిడీ రూపంలో బ్యాంకు ఖాతాలోకి వస్తుంది). ఈ ధరను పలు కుటుంబాల వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో కూడా ఎంత మంది కనెక్షన్లు తీసుకున్నారో ఉంది గానీ, ఎన్ని రీఫిల్ సిలిండర్లు బుక్కయ్యాయో లేదు. సంబిత్ పాత్రా శుక్రవారం నాడు పూరీ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
ଏହା ମୋର ନିଜ ଘର, ମାଁ ମୋତେ ନିଜ ହାତରନ୍ଧା ଖୁଆଇଲେ । ମୁଁ ମଧ୍ୟ ମୋ ନିଜ ହାତରେ ତାଙ୍କୁ ଖୁଆଇଲି ଏବଂ ମୁଁ ଜାଣେ ମାନବ ସେବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ସବୁଠୁ ବଡ଼ ପୂଜା ଅଟେ l [2/2]@BJP4Odisha #PhirEkBaarModiSarkar pic.twitter.com/PiZLZKSZmL
— Sambit Patra (@sambitswaraj) March 31, 2019