న్యూఢిల్లీః ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తిస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసినందున ఈ పిటిషన్కు కాలం చెల్లిందని కోర్టు పేర్కొంది. చిదంబరం తరుపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. మరోవైపు తన అరెస్ట్ను సవాల్ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగాల్సి ఉండగా.. అది ఇంకా లిస్ట్ కాలేదని ధర్మాసనం తెలిపింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్న అనంతరమే ఈ ఆర్డర్ ను రిజిస్ట్రీ చేస్తారని వివరించింది. అయితే చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటివరకు ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీలో చిదంబరాన్ని అధికారులు విచారించారు. మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కూడా కోర్టును కోరారు. ఇవాళ్టితో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుంది.
previous post
next post