న్యూఢిల్లీ: తన పేరు ముందు చౌకీదార్ అని తగిలించుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. ఓ వ్యక్తి ఎంతలా తిట్టినా రెచ్చిపోకుండా చాలా సౌమ్యంగా సమాధానమిచ్చారు. తన పాస్ పోర్టు రావడం లేదని, అందువల్ల సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పడానికి అతడు ట్విట్టర్ వేదికగా నానా తిట్లు తిట్టాడు. ఆమె చౌకీదార్ కాదన్నాడు. తనకు సమయానికి పాస్ పోర్టు రాకపోవడం వల్ల మంచి ఉద్యోగం పోగొట్టుకున్నానని తిట్టాడు. తానింకా దానికోసం వేచి చూస్తూనే ఉన్నానన్నాడు. దానికి సమాధానంగా, ‘‘మీ పొగడ్తలకు ధన్యవాదాలు. ఈ రోజు మా కార్యాలయ అధికారులు మిమ్మల్ని సంప్రదించి, పాస్ పోర్టు రావడానికి మీకు సాయం చేస్తారు’’ అని సుష్మ ట్వీట్ చేశారు.
Thanks for your compliments. My office will get in touch with you today and help you get the Passport. https://t.co/4GT2enfEcG
— Sushma Swaraj (@SushmaSwaraj) April 1, 2019
అంతకుముందు మరోవ్యక్తి ట్విట్టర్ పేరుకు ముందు చౌకీదార్ అని ఎందుకు తగిలించుకున్నారంటూ మండిపడ్డాడు. జర్మనీలో ఒక భారతీయ జంటను ఎవరో పొడిచారని, ఆ జంటకు చెందిన ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకోవాల్సిందిగా మ్యూనిచ్ నగరంలోని భారతీయ అధికారులకు చెప్పానని సుష్మా అన్నప్పుడు అతడీ వ్యాఖ్య చేశాడు. తాను భారతీయ ప్రయోజనాలకు, విదేశాలలో ఉన్న భారతీయులకు చౌకీదారీ చేస్తున్నందున (కాపలా కాస్తున్నందున) ఇలా పెట్టుకున్నానని అతడికి సుష్మా సమాధానం ఇచ్చారు. సాధారణంగా ట్వీట్లకు వెంటనే సమాధానం ఇచ్చే మంత్రి.. తన ట్విట్టర్ విషయాన్ని సిబ్బందకి అప్పగించేశారని ఇంకో యూజర్ ఆరోపించాడు. దానికి కూడా ఆమె.. ‘‘అది నేనే.. నా దెయ్యం కాదు’’ అని చెప్పారు.
Because I am doing Chowkidari of Indian interests and Indian nationals abroad. https://t.co/dCgiBPsagz
— Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019
నరేంద్ర మోదీ సర్కారులో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించే మంత్రులలో సుష్మా ఒకరు. ఇథియోపియా ఎయిర్ లైన్స్ ప్రమాదంలో మరణించిన నలుగురు భారతీయుల గురించి గత నెలలో సుష్మాస్వరాజ్ ఒక వినతి చేశారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫోన్ వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పాలని కోరారు. మృతురాలి భర్త ఫోన్ నంబరు సమాధానం రావడం లేదని చెప్పారు.