ముంబాయి: అంతర్జాతీయ క్రికెట్ నుండి టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నిష్క్రమించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటి వరకూ తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులు, సహచరులు, మిత్రులకు యువరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదనీ, క్రికెట్ తనకు ఆడటం, పోరాడటం, పడటం, లేవడం, ముందుకు సాగడమూ నేర్పిందని యువరాజ్ అన్నారు.
ఇక మీదట కేన్సర్ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని యువరాజ్ చెప్పారు.
17సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన అరుదైన రికార్డు ఆయన సొంతం. ఆయన కేరీర్లో 40 టెస్ట్లు, 304 వన్డేలు, 58 టీ-20 మ్యాచ్లు ఆడారు. వన్డేల్లో 8701,టెస్టుల్లో 1900, టీ 20 మ్యాచ్లలో 1177 పరుగులు చేశారు. యువరాజ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2011 ప్రపంచ కప్ను భారత్ గెలుచుకున్నది.
2017 జూన్ 30న వెస్టిండీస్పై చివరి వన్డే, 2012 డిసెంబర్ తొమ్మిదిన ఇంగ్లండ్లో చివరి టెస్టు మ్యాచ్ యువరాజ్ ఆడారు.
2011 ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో యువరాజ్ కేన్సర్ బారిన పడ్డారు. ఈ ప్రపంచ కప్ మ్యాచ్ అనంతరం కేన్సర్ చికిత్స తీసుకున్నారు. కేన్సర్ నుండి కోలుకున్న తరువాత యువరాజ్ ఆటలో వెనుకబడిపోయారు.