Jio: భారత దేశంలో చాలా మంది వినియోగదారులు వాడే నెట్ వర్క్ జియో. టాప్ మోస్ట్ నెట్ వర్క్ లను వెనక్కి నెట్టి.. దూసుకుపోతున్న జియో(Jio).. తాజాగా తన వినియోగదారులకు.. బ్రేకింగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే పండుగ సీజన్ నేపథ్యంలో.. చాలావరకు సైబర్ నేరగాళ్లు కొన్ని ఆఫర్లు అంటూ.. మెసేజ్ లు ఇటీవల పంపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ-కేవైసీ అంటూ.. ఒక ఫేక్ మెసేజ్ ద్వారా చాలా మందిని.. సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం జరిగింది. ఇతర నెట్ వర్క్ వినియోగదారులు ఇప్పటికే ఈ-కేవైసీ సందేశం బారినపడి.. డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నట్టు టాక్.
దీంతో ఇటువంటి తరుణంలో ఈ-కేవైసీ..వచ్చే ఫేక్ మెసేజెస్కు స్పందించవద్దని వినియోగదారులకు జియో నెట్ వర్క్ సూచించింది. ఒక jio మాత్రమే కాదు ఎయిర్టెల్(Airtel), వోడాఫోన్(Vodafone), ఐడియా(Idea) నెట్ వర్క్ లు కూడా అలర్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ-కేవైసీ.. మెసేజ్ లింకులకి స్పందించ వద్దు ఓపెన్ చేయవద్దు, పండుగ సీజన్ నేపథ్యంలో ఆఫర్లు అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటు వినియోగదారులకు సూచించడం జరిగింది.
అదేవిధంగా పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ గానీ ఆధార్(Aadhar) నెంబర్ వంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ కి చెప్పవద్దని… తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు పంచుకో వద్దని సూచించింది. పండుగ సీజన్ నేపథ్యంలో వచ్చే లింకులు కూడా ఓపెన్ చేయొద్దు అని.. నెట్వర్క్ సంస్థలు తమ వినియోగదారులను అలర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జియో(Jio) తాజాగా ఈ-కేవైసీ మెసేజ్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని స్పందించ వద్దని.. వినియోగదారులనీ హెచ్చరించింది. లాక్ డౌన్ లు పెట్టిన నాటి నుండి ఈ సైబర్ కేసులు దేశంలో ఎక్కువ నమోదు అవుతూ ఉండటంతో.. ఫోటో ఫేక్ కాల్స్.. ఫేక్ మెసేజ్ లు వస్తూ ఉండటంతో.. నెట్ వర్క్ సంస్థలు వినియోగదారులను అలర్ట్ చేస్తున్నాయి.