Congo fever: ప్రపంచంలో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. 2019లో చైనా దేశం నవంబర్ మాసంలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అనేక ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు పైగా ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. అయినా కానీ కరోనా వైరస్ ప్రభావం ఏదో ఒక దేశంలో ఇంక విజృంభిస్తున్నే ఉంది. ఇటువంటి తరుణంలో ప్రపంచంలో పలు రోగాలు ఇప్పుడు కొత్తగా బయటపడుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం యూరప్ దేశాలలో మంకీ పాక్స్ అనే కొత్త వ్యాధి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ వ్యాధి కారణంగా అనేక మంది ప్రజలు ఒంటిపై దద్దుర్లుతో తీవ్ర నొప్పితో బాధ ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఇరాక్ దేశం లో కొత్త వ్యాధి బయటపడింది. కాంగో ఫీవర్ అనే ఈ కొత్త రకం వ్యాధి బారిన పడిన వాళ్ళు.. ముక్కునుండి రక్తం కారి మరణిస్తున్నారు. వాస్తవానికి ఇది ఇరాక్ దేశంలో 1979లో తొలి కేసు బయటపడింది. జంతువుల నుండి మానవులకు సోకే ఈ వ్యాధి వల్ల జ్వరం ముక్కు నుంచి రక్తం కారటం వంటి లక్షణాలతో మరణిస్తారు.
ప్రస్తుతం ఇరాక్ దేశంలో 19 మంది కాంగో ఫీవర్ బారిన పడటం జరిగింది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి గ్రామీణ ప్రాంతాలలో ఇరాక్ ప్రభుత్వం క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తూ ఉంది. కాంగో ఫీవర్ బారిన పడితే రక్తం పీల్చే పేలు ద్వారా.. మానవ శరీరం బలహీన మయి మరణానికి గురి అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం రక్తం చెమట కణాల ద్వారా.. ఇతరులకు వ్యాపిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యి ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ఆఫ్రికా, ఆసియా, మధ్య తూర్పు ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.