Vijay Devarakonda-Samantha: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ప్రస్తుతం `ఖుషి` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదీ ప్రేమకథా చిత్రమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
కాశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. కాశ్మీర్ లో దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగింది. తొలి షెడ్యూల్ పూర్తి కావడంతో `ఖుషి` టీమ్ హైదరాబాద్ చేరుకుంది. జూన్ రెండో వారం నుంచీ సెకెండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు విజయ్, సమంతల రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వైరలగా మారింది. దాని ప్రకారం ఈ పాన్ ఇండియా చిత్రానికి గానూ విజయ్ రూ. 20 కోట్లకు పైగానే పారితోషికాన్ని అందుకుంటున్నాడట. అలాగే సమంత రూ. 4 కోట్ల వరకు వసూల్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వాళ్లకే తెలియాలి.
కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో కాశ్మీర్ కుర్రాడిగా విజయ్, తమిళ అమ్మాయిగా సామ్ కనిపించబోతున్నారు. అలాగే మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.