కార్లు చౌకగా వస్తున్నాయంటే ఎవరు వదులుకుంటారు. అది కూడా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా ఇస్తుందంటే.. అవును ఈ సంస్థ తమ వాహనాలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను భారీగా ప్రకటించింది. ఈ సంస్థతో పాటు మరో రెండు సంస్థలు కూడా రాయితీలను ప్రకటించాయి.
మహీంద్రా ఇప్పటికే చాలా సార్లు తమ వాహనాలపై ఆఫర్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా లక్ష రూపాయల వరకు ఆఫర్ ఇచ్చింది. తాజాగా 3లక్షల వరకు డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను ఇస్తున్నట్టు తెలిపింది. మహేంద్ర ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన థార్ ఆర్ ఎస్ యువీ మినహా అన్ని రకాల కార్ల పై రాయితీలను అందిస్తోంది. నగదు రాయితీ, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఇంకా మరికొన్ని ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుందని ఈ సంస్థ ఇప్పటికే పేర్కొంది.
మహీంద్రా కార్లపై ఈ విధంగా ఆఫర్లు ఉన్నాయి. మహీంద్రా ఫ్లాగ్ షిప్ ఎస్ యూవీ అల్టురస్ జీ4 మోడల్ పై గరిష్టంగా రూ. 3.06 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తుంది. మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్ పై 51,000 వరకు, మహీంద్రా కేయూవీ 500 ఎన్ ఎక్స్ టీ మోడల్ పై రూ. 62,055 వరకు రాయితీ ఇచ్చింది. స్కార్పియో పై రూ. 30,600 వరకు, బొలెరో పై రూ. 20,550 వరకు ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 12,000, ఎక్స్చేంజి బెనిఫిట్స్, ఇతర ప్రయోజనాలను కలుపుకొని 8,500 ఇస్తుంది. ప్రస్తుతం కాలంలో సగటు మనిషి జీవనాన్ని విలైనంతలో లగ్జరీగా గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా వాాహనాల విషయంలో ఆలోచనలు మారుతున్నాయి. ఇనాళ్ళు బైక్లు నిత్యావసరాలుగా ఉన్న ఇప్పుడు కార్లు ప్రతి కుటుంబానికి కామన్గా మారిపోయింది. ఇలా సామాన్యుడు ఆలోచనను కూడా కార్ల కంపెనీలు క్యాష్ చేసుకుంటాయి. రకాలరకాల ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి.