కరోనా వలన లాక్ డౌన్ విధించారు.లాక్ డౌన్ ఎఫెక్ట్తో అందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇంతకు ముందు ఆఫీసులు, బయటి పనులతో చాలా సమయం బయటే గడిపేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా ఇంటికి పరిమితమయ్యారు.
ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు పెరిగే ముప్పు పెరుగుతుంది. ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అధికంగా పేరుకుపోయిన కొవ్వు హార్మోన్ల స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఇది కణాల పెరుగుదలను ప్రభావితం చేసి.. పెద్ద పేగు కేన్సర్ రావడానికి దోహదం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. టీవీ చూస్తే కాసేపు కాలక్షేపం. టైమ్పాస్ అవ్వడానికి చూస్తుంటారు. అయితే, కొందరు మాత్రం అదే పనిగా టీవీ చూస్తుంటారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు.. ముందు కూడా ఇలానే ఎక్కువ సమయం టీవీ చూసేవారు. అయితే, ఇలాంటి వారిని పరీక్షించిన పరిశోధకులు కొత్త విషయాలను చెబుతున్నారు.
వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉండి అవి తీరకపోతే ఆ అసంతృప్తితో ఉన్నవారే ఎక్కువగా టీవీ చూస్తుంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే, ఇవేవో ఆషామాషీగా చెప్పిన విషయాలు కాదు.. మేరీ ల్యాండ్ యూనివర్శిటీ నలభై వేల మందిపై అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉన్న వారు అవి తీరక అసంతృప్తితో ఉంటే దాంతోనే టీవీ చూస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉండేవారు టీవీ చూసే గంటలతో పోలిస్తే అసంతృప్తిపరులు 30 శాతం ఎక్కువగా రకరకాల ప్రోగ్రామ్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారని తేలింది.ఈ ఒక్క విషయమే కాదు.. ఇలా టీవీ చూస్తుంటే… సమస్య తగ్గుతుందని భావిస్తే అది తప్పేనని.. టీవీ చూడడం వల్ల తాత్కాలికంగా మనసుకు ఊరటగా అనిపించినా ముందు, ముందు తీవ్ర నిరాశకు గురవుతారని చెబుతున్నారు. మరి అలాంటి అసంతృప్తి వంటి సమస్యతో ఎలా బయటపడాలంటే.. పుస్తకాలు చదవడమో.. స్నేహితులతో కాలక్షేపం చేస్తే సమస్య చాలా వరకూ తగ్గుతుందని ముఖ్యంగా సన్నిహితులతో చక్కని సంబంధాలు కలిగి ఉంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు.కాబట్టి ఇంకా టీవీ చూసే అలవాటుని తగ్గించుకోండి.