సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు టాప్ హీరోగా రాణిస్తున్న రజినీకాంత్ కొన్ని సంవత్సరాల క్రితం తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రజనీకాంత్ పోటీ చేయడానికి రెడీ కావడం జరిగింది. ఈ క్రమంలో 2020లో డిసెంబర్ నెలలో పార్టీ పేరు ఇంకా విధివిధానాలు ప్రకటించడానికి కూడా రెడీ అయ్యారు. ఎప్పటినుండో ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అభిమానులు ఈ వార్త తెలుసుకొని భారీగా ఏర్పాటు చేయడం జరిగింది.
పార్టీ పేరు ఇంక విధివిధానాల గురించి రజిని కాంత్ ఎటువంటి ప్రకటన చేస్తారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉన్న సమయంలో రజనీ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి కోలుకున్న రజిని తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అభిమానులకు మూడు పేజీల లెటర్ రాస్తూ.. వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నికలు జరగటం స్టాలిన్ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరోసారి రజిని పొలిటికల్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ ని రజనీకాంత్ కలవడం జరిగింది.
అనంతరం రజిని మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని తెలిపారు. ఇటీవల మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చిన క్రమంలో రజిని..తమిళనాడు గవర్నర్ ని కలిసిన తర్వాత క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం రజిని .. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.