ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచంపై పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు అందరు కరోనా వైరస్ కు వాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతలోపు ఈ వైరస్ బారిన పడకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల కరోనా భారీ పడకుండా, ఒకవేళ కరోనా సోకిన ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఉండేందుకు మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం ఎంతో అవసరం. క్షణాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకొని క్షణాల్లో కరోనా వైరస్ ని తరిమికొట్టండి.
మనం తీసుకునే ఆహారం ఎన్నో పోషక విలువలతో కూడినదై ఉండాలి. అంతేకాకుండా విటమిన్ సి అధికంగా లభించే పండ్లు, పాల పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిని తాగడం, పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం, తులసి ఆకులు, దాల్చిన చెక్క, కలిపి నీటిలో బాగా మరిగించి ఆ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మన శరీరంలో ఎటువంటి జలుబు దగ్గు ఉన్న కూడా తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో ఒక టేబుల్ స్పూన్ చవ్యన్ ప్రాష్ మిశ్రమాన్ని కలిపి తాగడం వల్ల మన శరీరం చురుగ్గా పని చేయడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.