ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చాలావరకూ కులాల తో ముడిపడి ఉంటాయి అని చాలామంది చెబుతారు. తెలంగాణలో కుల ప్రస్తావన అంతగా ఉండదు అని ఏపీలో కులగజ్జి రాజకీయాలు ఎక్కువ అని ముఖ్యంగా కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం జరుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అధికారాన్ని డిసైడ్ చేసేది కొన్ని సామాజిక వర్గాలు అని వాటిలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అని చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ పరంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం కి బలమైన ఓట్ బ్యాంక్ ఉందని విశ్లేషిస్తారు.
అందువల్లే కాపులను ప్రసన్నం చేసుకోవడానికి ఏపీలో తల పండిన రాజకీయ నేతలు పలు రాజకీయ వాగ్దానాలు హామీలు ఇవ్వటం ఎన్నికలలో జరుగుతుందని చెబుతారు. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకునే బిజెపి ఎక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ని అధ్యక్షుడు చేయటం జరిగిందని, దాని వల్ల పార్టీ లాభపడే అవకాశం ఉందని స్కెచ్ వేసిందని చాలా మంచిది అభిప్రాయపడతారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తాను అంటూ చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి రావటం అందరికీ తెలిసిందే.
అయితే అధికారంలోకి వచ్చినా చంద్రబాబు.. కాపులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పరిపాలన చేస్తున్న సమయంలో కాపు ఉద్యమనేత గా రంగంలోకి దిగి టిడిపి పార్టీ ని ముప్పుతిప్పలు పెట్టారు ముద్రగడ పద్మనాభం. అప్పట్లో ముద్రగడ దీక్షకు కూడా రెడీ అయిన క్రమంలో ముద్రగడ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు టిడిపి గురి చేసిందని చెబుతారు. ఇటువంటి తరుణంలో ముద్రగడ్డ సొంత అడ్డాలో అనగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన పార్టీ పెట్టబోతున్నట్లు సరికొత్త ఫ్లెక్సీలు రాత్రికి రాత్రి దర్శనమివ్వడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనమైంది.
దీంతో వెంటనే స్పందించిన ముద్రగడ్డ సీరియస్ అయ్యారు. తనకి తెలియకుండా ఎవరో ఇలాంటి ప్రయత్నాలు చేసి తన గౌరవాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని వెంటనే వారిపై విచారణ చేయాలని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది కాకినాడ కి సంబంధించిన విషయం కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు ముద్రగడ్డ చెప్పినట్లు సమాచారం.