న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని హుమాయూన్ రోడ్డులో ఓ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఓ దినపత్రిక యజమాని రాజేంద్ర వ్యాస్ ఆ ప్రమాదంలో గాయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత అదే రోడ్డు మీదుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళ్తున్నారు. ఆయన వెంటనే తన కారు ఆపి.. ఆయనను ఎక్కించుకుని, ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సదరు జర్నలిస్టు నుదుటి మీద గాయమై రక్తం కారుతుండగా రాహుల్ గాంధీ ఓ కర్చీఫ్ తీసుకుని తుడుస్తుండగా ఆ దృశ్యాన్ని ఆయన సిబ్బంది వాహనం ముందు సీట్లోంచి వీడియో తీశారు. ఆ వీడియో అలా తీస్తుండగానే.. ‘‘సర్, కర్చీఫుతో మరోసారి తుడవండి, ఈ వీడియోను నేను నా పనికి వాడుకుంటా’’ అని చెప్పడం కనిపించింది.
#WATCH Congress President Rahul Gandhi checks on a photographer who tripped and fell at Bhubaneswar Airport, Odisha. pic.twitter.com/EusYlzlRDn
— ANI (@ANI) January 25, 2019
దాంతో రాహుల్ గాంధీ కూడా ఒక్కసారిగా నవ్వేసి, సరేనంటూ వీడియో కోసం మరోసారి తుడిచారు. వ్యాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్కతోరా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని రాహుల్ తిరిగి వస్తుండగా ఇదంతా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటిదే ఈ సంవత్సరం మొదట్లో కూడా ఓ ఘటన జరిగింది. అప్పుడు రాహుల్ ఒడిశా పర్యటనలో ఉన్నారు. ఆయన భువనేశ్వర్ విమానాశ్రయానికి వచ్చినపుడు మీడియా వాళ్లంతా ఆయనను చుట్టుముట్టడంతో ఓ జర్నలిస్టు అదుపుతప్పి కింద పడిపోయారు. ఆయన తల రోడ్డు మీద ఫుట్ పాత్ కు తగిలింది. రాహుల్ వెంటనే అటు పరిగెత్తి, ఆయనకు సాయం చేశారు.
I am yet to see a person with more humane qualities than @RahulGandhi
We can narrate hundreds of such instances- But the problem is, that he does not want to publicise these.
This makes him perhaps more humane! https://t.co/RXrz9A34CU— Ajay Maken (@ajaymaken) March 27, 2019