ఇండియాలోనే గ్రేట్ దర్శకుడిగా ఎస్.ఎస్ రాజమౌళి పేరు మారుమోగుతుంది. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి, RRR లతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన దర్శకుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి దర్శకుడు రాజమౌళి తన కెరియర్ లో ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ అని అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమా నుండి తిరుగులేని దర్శకుడిగా ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని డైరెక్టర్ గా రాజమౌళి విజయవంతంగా కొనసాగిపోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో “స్టూడెంట్ నెంబర్ వన్” తెరకెరకెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త వార్త వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు… “రాజకుమారుడు”, బన్నీ… “గంగోత్రి”, రామ్ చరణ్…”చిరుత” ఇలా ఈ హీరోల మొదటి సినిమాలు మా బ్యానర్ లోనే తెరకెక్కయి.
కానీ తారక్ ది స్టూడెంట్ నెంబర్ వన్ రెండో సినిమా. వాస్తవానికి ఈ సినిమా మొదటి హీరో ప్రభాస్.. ప్లాన్ చేయటం జరిగింది. అయితే ఆ సమయంలో హరికృష్ణ ఫోన్ చేయటంతో మొత్తం ప్లాన్ మారింది స్టూడెంట్ నెంబర్ వన్ తారక్ చేయడం జరిగింది. వాస్తవానికి ప్రభాస్ మొదటి సినిమా మా బ్యానర్ లోనే రావాల్సింది మిస్సయింది అన్నట్టు అశ్విని దత్ చెప్పుకొచ్చారు. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న “ప్రాజెక్ట్ కే” వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ సినిమా. నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరు.