ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. శనివారం ఢిల్లీలోని మోతినగర్ లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహిస్తుండగా ఎరుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రచారరధం మీదకు నెళ్లి దుర్భాషలాడుతూ కేజ్రీవాల్ పై చేయి చేసుకున్నాడు.
ఈ హఠాత్ పరిణామానికి ఆయన ఖిన్నుడయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అప్ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన ప్రతిపక్షాల కుట్ర అని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమయ్యందని విమర్శించారు.
కేజ్రీవాల్ పై జరిగిన దాడిని ఎపి సియం చంద్రబాబుతో సహ పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.