(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బుల్లెట్ ట్రయిన్ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్షెన్ బుల్లెట్ ట్రైన్కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. 280 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బులెట్ రైలులోని ఓ భోగిలో తలుపు తెరుచుకునే ఉన్నాయి. ఒక నిమిషం పాటు తెరిచి ఉన్న డోర్స్ తోనే ప్రయాణించింది. జపాన్లోని హయాబూసా స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగింది. టోక్యోలోని షింకాన్షెన్ నుంచి బయలుదేరిన బులెట్ రైలు.. హయాబూసా వద్ద ఆగిన తరువాత డోర్స్ లాక్ కాకముందే కదిలింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో రైలులో మొత్తం 340 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రయిన్ అలాగే మరికొంత దూరం ప్రయాణించి ఉంటే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని అధికారులు చెప్పారు. జరిగిన పొరపాటుకు రైల్వే అధికారులు క్షమాపణలు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.