అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్పై ఆయన తొలి సారిగా స్పందించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా చేసినట్లు జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామనీ, దేశంలో ఎవరూ ఇలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టలేదనీ జగన్ పేర్కొన్నారు.దేశంలోని ఏ రాష్ట్రంలోనూ న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ విధానాలు లేవేనీ, వంద కోట్ల రూపాయలు దాటిన ఏ టెండర్నైనా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తున్నామని జగన్ చెప్పారు. పారదర్శక విధానాల్లో న్యాయ సమీక్షే అత్యుత్తమమైనదని జగన్ అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. పిపిఎల విషయంలో కూడా విప్లవాత్మక విధానాలు చేపట్టినట్లు జగన్ చెప్పారు. అధిక ధరలకు చేసుకున్న పిపిఎలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికిబట్టకట్టవని జగన్ అన్నారు. విద్యుత్ రంగంలో పరిస్థితులను సరిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. విద్యుత్ రంగం పునరుద్ధరణకు అందరి సహకారం కావాలని సిఎం జగన్ కోరారు.