న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలుసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోది, అజిత్ దోవల్లతో ఈయూ బృందం చర్చించింది. ఈ బృందం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోనూ భేటీ కానుంది. మంగళవారం ఈ బృందం స్వయంగా కశ్మీర్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆగస్టు అయిదున కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అనంతరం కశ్మీర్ పరిస్థితులపై పాకిస్తాన్ అనేక ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ సమాజం నుండి భారత్కు సానుకూలంగానే ప్రకటనలు వచ్చినప్పటికీ కొన్ని స్థాయిలో విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈయూ బృందం కశ్మీర్లో పర్యటించడం ఆసక్తి నెలకొంది.
ఈయూ ప్రతినిధి బృందం పర్యటనపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ స్పందించారు. స్థానిక ప్రజలు, స్థానిక మీడియా, డాక్టర్లతో ఈ బృందం కలిసి మాట్లాడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Hope they get a chance to speak to the people, local media, doctors and civil society members. The iron curtain between Kashmir & the world needs to be lifted and GOI must be held accountable for pushing J&K into turmoil https://t.co/okZkVUK8Jz
— Mehbooba Mufti (@MehboobaMufti) October 28, 2019