ముంబాయి: శివసేన నుండి గెలిచిన 56 మంది ఎమ్మెల్యేలలో 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో టచ్లో ఉన్నారని బిజెపి ఎంపి సంజయ్ కాకడే వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించింది.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పంపకం విషయంలో బిజెపి, శివసేన మధ్య అంతరం పెరిగిపోతున్నది. ముందుగా అనుకున్నట్లు రెండున్నరేళ్ల సిఎం పదవి తమకు కేటాయించాల్సిందేనని శివసేన పట్టుబడుతున్నది. అవసరమైతే ఎన్సిపి, కాంగ్రెస్లతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా సంకేతాలు ఇస్తున్నది. ఇదిలా ఉండగా అయిదేళ్లు తానే సిఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ ఘంటాపథంగా చెబుతున్నారు. సిఎం సీటు విషయంలో తామెప్పుడు 50:50 ఫార్మలా పాటిస్తామని వారికి హామీ ఇవ్వలేదని ఆయన అంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతుతోంది.
మరో వైపు బిజెపి ఎంపి సంజయ్ కాకడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘శివసేన నుంచి కొత్తగా ఎన్నికైన 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారు. వీరిలో కొంత మంది ఎమ్మెల్యేలు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు నచ్చజెప్పి ఒప్పిస్తారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో మరో మార్గం ఉందని నేను భావించట్లేదు’ అని సంజయ్ అన్నారు.
BJP MP Sanjay Kakade: 45 newly elected MLAs in Shiv Sena are in touch with Chief Minister & want alliance government to be formed. I think few of these 45 MLAs will convince Uddhav Thackeray and form government with Devendra Fadnavis as CM. I don't think there is any other option pic.twitter.com/RMvQlViqN9
— ANI (@ANI) October 29, 2019