ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి ఆ మూడు పార్టీలు పరేడ్ నిర్వహించాయి. తాము ఎలాంటి ప్రలోభాలకు లోంగబోమంటూ మూడు పార్టీల నేతలు ప్రమాణం చేశారు. ‘మహా వికాస్ ఆఘాడి’ వర్థిల్లాలంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అశోక్ చవాన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే తదితరులు హాజరయ్యారు.
మహారాష్ట్రలో బీజేపీ అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. అజిత్ పవార్ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. అజిత్ పవార్ కు విప్ జారీచేసే హక్కులేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఆదేశించలేరని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఎప్పుడు ఆదేశించినా బలప్రదర్శనకు తాము సిద్ధమేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలు ఎవరూ భయపడవద్దు. ఇది గోవా, మణిపూర్ కాదు… మహారాష్ట్ర! బీజేపీకి మరాఠా రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
We are all one and together , watch our 162 together for the first time at grand Hyatt at 7 pm , come and watch yourself @maha_governor pic.twitter.com/hUSS4KoS7B
— Sanjay Raut (@rautsanjay61) November 25, 2019