NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ .. ఎందుకంటే..?

Share

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు నారా లోకేష్. ఈ నెల 27,28 తేదీల్లో రాజమండ్రి లో టీడీపీ మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వ తేదీన జమ్మలమడుగు నుంచే పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు.

Nara Lokesh Padayatra

 

జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకున్న నారా లోకేష్ కడప ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో లోకేష్ గన్నవరం చేరుకుని అక్కడ నుండి అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుండి బయలుదేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు. కాగా, గురువారం ఉదయం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ


Share

Related posts

Mahesh : మహేష్ బర్త్ డేకి సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్

GRK

సాయి పల్లవి సినిమా కోసం రెండు తెలుగు ప్లాట్ ఫాంస్ కొట్టుకు చస్తున్నాయి.. ఇంత క్రేజ్ ఏంటి బాబోయ్..?

GRK

బిగ్ బ్రేకింగ్ ! మోడీ తలరాతను మార్చబోతున్న జగన్ నిర్ణయం??

Yandamuri