ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో రాష్ట్రంలో దేవాలయాల పై జరిగిన దాడులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని.. ఇది ఒక కుట్రగా పేర్కొన్నారు. అంతేకాకుండా రామతీర్థం వద్ద బాబు వెళ్లడానికి తప్పుబడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
పదవుల కోసం గుళ్లు, చర్చిలు అదేవిధంగా మసీదులకు తిరిగే చంద్రబాబుకి భగవంతుడు అంటే నమ్మకం లేదని స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు అన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి నారా లోకేష్ సవాల్ చేయటాన్ని ఖండించారు. నువ్వు తింటా కి, తిరగటానికి, దున్నపోతు లాగా పడుకోడానికి పనికొస్తావ్.. నువ్వు ఒక్క బఫూన్ అంటూ సరికొత్త పేరుతో లోకేష్ పై భారీ స్థాయిలో ఫైర్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించి దాదాపు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రభుత్వాన్ని స్థాపించారు. ముఖ్యమంత్రి అయ్యారు. మీ తాత ముఖ్యమంత్రి మీ బాబు ముఖ్యమంత్రి అటువంటి ఫ్యామిలీ నుండి అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక పోయావు. నువ్వు ఒక చిన్న మిడత లాంటి వాడివి.. నీ లాంటోడు జగన్ కి సవాల్ చేయడం ఏంటి అంటూ..సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ గురించి సరిగా మాట్లాడకపోతే పళ్ళు రాలిపోతాయి.. అని కొడాలి నాని.. లోకేష్ బాబు కి భారీ డైలాగులు వేశారు.