NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చెదురుమదురు ఘటనలతో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

MLC Election Poling

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా కొనసాగింది. అనంతరం నగరంలోని కేఎన్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. వైసీపీ నేతలకు అనుకూలంగా అధికారుల వ్యవహరిస్తున్నారని, దొంగ ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారంటూ బీజేపీ నాయకులు రోడ్లపై భైటాయించి ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఓటు గల్లంతైంది. ఆయనతో పాటు ధర్మశ్రీ కుటుంబ సభ్యులకు చెందిన 12 ఓట్లు గల్లంతైయ్యాయి. దీంతో ధర్మశ్రీ తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఓట్ల గల్లంతైన విషయంపై ఎన్నిల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

MLC Election Poling
MLC Election Poling

 

తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద పదవ తరగతి చదివిన మహిళ గ్రాడ్యుయేటే ఓటు వేసేందుకు వచ్చారు. అక్కడ ఉన్న మీడియా ఆమెను ప్రశ్నించగా పదో తరగతి చదివాను అని సమాధానం ఇచ్చింది. డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నారు అంటూ ప్రశ్నించగా, ఆమె మౌనం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ లిస్ట్ ను వైసీపీ ఏజెంట్ తీసుకువెళ్లడంతో టీడీపీ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. దీంతో 15 నిమిషాలు పోలింగ్ నిలిపివేసి మళ్లీ కొనసాగించారు. హిందూపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సే ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి విమానంలో వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి తేజ రెడ్డికి తన ఓటు గల్లంతు అవ్వడంతో నిరాశతో వెనుతిరిగారు.

పలు కేంద్రాల్లో పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్ లో ఉన్నవారందరూ ఓటు హక్కు కల్పించుకునే అవకాశం కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్దివాదం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీటీడీ చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారావు స్థానికేతరుడైనా విశాఖలో ఉండటాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఏపిలో మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు సంఘటన మధ్య ముగిసింది.

ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N