Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏడో వారం నుండి హౌస్ లో చోటు చేసుకున్న మార్పులు .. షో చూడటానికి ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫిజికల్ టాస్కులు ఇచ్చి బిగ్ బాస్ చాలా మంచి పని చేయడం జరిగింది. అంతకు ముందు షో స్టార్టింగ్ లో… హౌస్ లో ఎవరు కూడా.. ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడిన సందర్భంగా కనిపించలేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా గేమ్ ఆడేవారు. కానీ బిగ్ బాస్ ఏడో వారంలో ఇంటి సభ్యులకు ఫుడ్ ఇవ్వకుండా… పోరాడి తినాలని … కండిషన్ పెట్టి ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో అందరిని నుంచోపెట్టి ఇంట్రెస్టింగ్ గా లెన్నోలు వెళ్ళిపోవచ్చు అని… గట్టిగా గడ్డి పెట్టారో అప్పటి నుండి హౌస్ లో మార్పులు చోటు చేసుకున్నయి. దీంతో హౌసుమేట్స్ సీరియస్ గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది.
కానీ అదే సమయంలో హౌస్ నుండి స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. ఏడో వారంలో అర్జున్ కళ్యాణ్… ఎనిమిదో వారంలో సూర్య ఇంకా తొమ్మిదవ వారం వచ్చేసరికి గీతూ ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ ముగ్గురి కంటెస్టెంట్ ఎలిమినేషన్ విషయంలో సూర్య, గీతూది ఎవరు అంచనా వేయలేకపోయారు. స్టార్టింగ్ లో వీరి ఆట తీరు చూసి ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు అవ్వుతున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ఎలిమినేట్ అయిన గీతూ… యాంకర్ శివతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో గీతూ.. అనేక విషయాలు తెలియజేశారు.
బిగ్ బాస్ హౌస్ తనని ఎంతగానో మార్చిందని తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా హౌస్ లో ఎవరితో స్నేహం ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నారు…అని ప్రశ్నించరు. దానికి గీతూ సమాధానం ఇస్తూ…ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహన్, బాలదిత్య, ఫైమా, శ్రీ సత్యతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తానని తెలిపారు. ఇనాయా, రోహిత్, మెరీనా, వాసంతి, కీర్తి లతో మాత్రం కలవను అని గీతూ బీబీ కేఫ్ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పింది.