సాధారణంగా ప్రజల ప్రయోజనాలు మరియు వారి అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పని చేయాలి. అంతేకానీ కక్ష సాధింపు చర్యలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే సభల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కానీ నయాపైసా ఉపయోగం కూడా ఉండదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి అర్ధం కానట్లుంది. ప్రతి సంవత్సరం టిడిపి నిర్వహించుకునే ‘మహానాడు’ ఈసారి డిజిటల్ మహానాడు గా జరిగిన విషయం తెలిసిందే. సాధారణంగా మూడు రోజులు జరిగే మహానాడుని కరోనా ప్రభావం వల్ల రెండు రోజులకే కుసించారు. ప్రతి సంవత్సరం అయితే ఈ మహానాడు లో పార్టీ లోని లోపాలు మరియు పార్టీ కేడర్ ను పటిష్టం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తారు.
కానీ ఈసారి మహానాడు అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. జరిగిన రెండు రోజులు కూడా కేవలం జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికే సమయం మొత్తాన్ని ఉపయోగించారు. చంద్రబాబు ఈసారి వారి నాయకుల మధ్య జరిగిన చర్చలు మరియు చేసుకున్న తీర్మానాల తీరు విచిత్రంగా ఉంది. రెండు రోజులు జరిగిన ప్రసంగాలు అన్నీ జగన్ చుట్టూ తిరగడం మరియు చంద్రబాబు గత పాలనను పొగడటం…. జగన్ చేస్తున్న ప్రస్తుత పాలనపై బురద చల్లడంతోనే కాలం గడిచిపోయింది. సరే ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడంలో తప్పేముంది అని అనుకుందా…. అయితే ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలకు ఇక్కడ జగన్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం?
మహానాడు జరిగిన 24 గంటల్లో బయటకు వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తే చంద్రబాబు కి పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి. ఈసారి మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోగా ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు మరియు ప్రతిపక్షాలు చేసిన రచ్చ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక అన్నదాత వెన్నువిరవటం గురించి కూడా తప్పుడు ఆరోపణలు, కథనాలే రాయిస్తున్నారు అని రిపోర్టులు తేల్చి చెప్పేశారు. ఇక రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారు అన్నదానికి ఆధారాలు లేవు కానీ అధికార పార్టీ మాత్రం నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయడం ఇంకా ఏడాది కాకుండానే రెండుసార్లు అకౌంట్లోకి నగదు జమ చేసిన తీరు ఇప్పుడు బాబు అన్న మాటలను నవ్వులపాలు అయ్యేలా చేసింది.
ఇదిలా ఉండగా కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం పంటలను పొలాల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసింది. ఇన్ని సానుకూలాంశాల మధ్య మరలా సాగునీటి ప్రాజెక్టులు సంక్షోభంలో పడ్డాయి అవాస్తవ ప్రచారానికి మహానాడుని ఉపయోగించుకున్న తీరు రిపోర్ట్ లో స్పష్టంగా కేంద్రీకృతమైంది. కరోనా సంక్షోభం కారణంగానే పోలవరం తదితర ప్రాజెక్టుల పనులు ఆగాయని బాబు తెలుసుకోలేని తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటానికి, బురద చల్లటానికే మహానాడు పరిమితం కాకుండా ఆత్మ పరిశీలన కూడా చేసుకునుంటే బాగుండేది.. లేకపోతే ఇటువంటి మహానాడులు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదని చంద్రబాబు గ్రహించాలి.