Women’s IPL 2023: ప్రపంచంలోనే క్రికెట్ అభిమానించే దేశం భారత్ అని అందరికీ తెలుసు. దీంతో దేశంలో ఏదో ఒక టోర్నమెంట్ నిర్వహిస్తూ భారీ ఎత్తున బీసీసీఐ క్యాష్ చేసుకుంటూ ఉంది. ఈ రకంగానే ఇండియాలో ఐపీఎల్ సీజన్స్ కొన్ని కోట్లు కుమ్మరిస్తున్నాయి. మార్చి నెల నుండి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పుడు ఇదే తరహాలో మహిళల ఐపీఎల్ కూడా బీసీసీఐ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ నీ “వయాకామ్ 18” మీడియా సొంతం చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను బీసీసీఐకి ₹951కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.
2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ “వయాకామ్ 18” సొంతం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ప్రతి మ్యాచ్ కి గాను బీసీసీఐకి ₹07.09 కోట్ల రూపాయలు “వయాకామ్ 18” మీడియా సంస్థ చెల్లించనుంది. మహిళల క్రికెట్ ప్రపంచానికి ఇది ఒక చరిత్రత్మకమని జైషా సోషల్ మీడియాలో కొనియాడారు. ఇదే సమయంలో మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు కొనుగోలు చేసుకోవడానికి “వయాకామ్ 18”.. సంస్థతోపాటు జీ, సోనీ, డిస్నీ స్టార్ రేసులో పాల్గొన్నాయి. కాని “వయాకామ్ 18” సంస్థ మీడియా హక్కులు కొన్ని వందల కోట్లతో సొంతం చేసుకోవడం జరిగింది.
పురుషుల మీడియా రైట్స్ తో పోలిస్తే మహిళలు ఐపీఎల్ తొలిసారే… ఈ రీతిగా భారీ ధరలో పలకడం గ్రేట్ అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ ఏడాది పురుషుల ఐపీఎల్ మీడియా రైట్స్ మూడు సంస్థలు సొంతం చేసుకోవడం జరిగింది. టీవీ రైట్స్ డిస్నీ స్టార్… డిజిటల్ రైట్స్ ను “వయాకామ్ 18” … ఇంకా ఇతర దేశాల్లో ప్రసారం చేసే హక్కులు “టైమ్స్ ఇంటర్నెట్” సొంతం చేసుకుంది. మహిళ ఐపీఎల్ హక్కులు మాత్రం “వయాకామ్ 18” ఒక్కటే సొంతం చేసుకుంది.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!