ABN RK: ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) కొత్త పలుకు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, మేధావి వర్గానికి చెందిన వారు. కానీ ఎందుకే ఈ మధ్య కాలంలో ఆయన రాతలను చూస్తుంటే కొంత గందరగోళంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన రాసిన రాతల్లో కొంచెం పొంతన, క్లారిటీ, స్పష్టత మిస్ అవుతోంది. రాతల్లో స్పష్టత మిస్ అయితే పాఠకులు కూడా జగన్మోహనరెడ్డి మీద ఒక అభిప్రాయానికి రావడం కష్టం అవుతుంది. ముందుగా ఏబీఎన్ ఆర్కే తన సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ వైఖరితో మనం వార్తలు రాయాలి అని చర్చించుకుంటే మంచిదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏబీఎన్ రాధాకృష్ణ గతంలో ఏమి రాశారు. ఇప్పుడు ఏమి రాశారు అని పరిశీలీస్తే..ఆయన క్లారిటీ మిస్ అవుతున్నారు అనేది అర్ధం అవుతుంది.
ABN RK: కొత్త పలుకులో క్లారిటీ మిస్
మూడు నెలల క్రితం రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఏపి సీఎం వైఎస్ జగన్ రోజు రాత్రుల్లో జీసెస్ తో మాట్లాడతారనీ, అప్పుడప్పుడు ఆయన తండ్రితో మాట్లాడతారనీ, ఆయన మానసిక పరిస్థితి మీద కొందరు ఐఏఎస్ అధికారులు తనతో చెప్పారని రాశారు. రాధాకృష్ణ రాసే కొత్త పలుకు చదివే వారికి ఇది గుర్తుండే ఉంటుంది. ఆయన మానసిక స్థితి బాగోలేదని అప్పుడు రాశారు. ఈ రాతలపై వైసీపీ శ్రేణులు ఆయనపై మండిపడటం కూడా జరిగింది. అదే రాధాకృష్ణ నేటి కొత్త పలుకులో జగన్ మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయనకు చాలా తెలివితేటలు ఉన్నాయనీ, ఆ తెలివితేటలతో ఇలా పరిపాలన చేస్తున్నారనీ, మూడు రాజధానుల వ్యవహారంలో గానీ, సంక్షేమ పథకాల అమలు లోగానీ, అప్పుల విషయంలో గానీ ఇలా చేస్తున్నారని రాశారు. ఈ రెండు రాతలు చూస్తుంటే క్లారిటీ మిస్ అయ్యింది ఎవరికి అనేది అర్ధం అవుతుంది కదా. ఆయన కొత్త పలుకులోనే క్లారిటీ మిస్ అయ్యింది.
ఆయన మెయిల్ అడ్రస్ తెలిసిన వాళ్లు ఇలా పొంతన లేకుండా రాయడం ఏమిటని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు క్లారిటీతో రాయండి, ఒక్క మాట మీదే మీరు ఉండండి అని పాఠకులు ఆయనకు సూచన చేయాలి. ఇలా అడిగితేనే రాష్ట్రంలో ఆ మీడియాను నమ్ముకున్న ఒక పార్టీ గానీ, ఆ మీడియాను ఫాలో కొన్ని వర్గాలకు గానీ ఒక క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేకుండా జర్నలిజం చేయడం గానీ రాజకీయం చేయడం గానీ చేయలేరు.