Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “సలార్” ఈనెల 22వ తారీకు విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి నైజాంలో మొదటి టికెట్ గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలియజేశారు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ గ్రేడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం “సలార్” సినిమా నైజాంకి సంబంధించి మొదటి టికెట్ కొనుగోలు చేయడం జరిగింది అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో రాజమౌళి టికెట్ పట్టుకున్న ఫోటో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ ఫోటోలో ఎస్.ఎస్ రాజమౌళితో పాటు “సలార్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ అదేవిధంగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్… మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఉన్నారు. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. సలార్ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ ఆ సమయంలో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ కి వాయిదా పడింది. “కేజిఎఫ్” సినిమాలతో … ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకుడు ప్రశాంత్ నీల్ అనేక రికార్డులు గతంలో క్రియేట్ చేయడంతో ప్రభాస్ “సలార్” ఫలితం పై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ప్రభాస్ నీ చాలా వైలెంట్ పాత్రలో చూపించడం జరిగింది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుందని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు. మొదటి ట్రైలర్ మూడు నిమిషాలకు పైగా ఉండగా అందులో కేవలం చివరి నిమిషంలో మాత్రమే ప్రభాస్ నీ చూపించారు. దీంతో ఫాన్స్ కొద్దిగ డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్ కి సంబంధించిన ట్రైలర్ మరొకటి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.