రాజధాని వికేంద్రీకరణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది మొదలు రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అందులో ప్రధానంగా వైజాగ్లో పరిణామాలు మారుతున్నాయి.
అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు ఇక్కడ హాట్ టాపిక్గా మారాయి. వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మారుతున్న రాజకీయాలకు పరాకాష్ట. అయితే, అదే సమయంలో వైసీపీలో సైతం కొత్త రాజకీయాలు జరుగుతున్నాయి.
విశాఖలో రాజధాని అంశం తెరమీదకు రాగానే కొందరు వైసీపీ నేతల దూకుడు పెరిగిందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారట. విశాఖకు సంబంధం లేని చాలా మంది నేతలు విశాఖలో పెత్తనం చేస్తున్నారని లోకల్ క్యాడర్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. విశాఖలో జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భూములను కొనే పనిలో ఉన్నారట. అయితే, ఇలాంటి పనుల్లో ఉన్న ఓ నేత బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైసీపీకి ఓటు వేసిన చాలా మంది భూములను కొనే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. దళితుల భూములు లాక్కుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని కొందరు ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విశాఖలో భూముల కొనుగోలు అమ్మకం పర్యవసనాలపై పలువురు ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని టాక్ తెరమీదకు వస్తోంది. కొందరు ఇప్పటికే సీఎం జగన్ దృష్టిలో ఇక్కడి రాజకీయాలను ఉంచారని సమాచారం. కొందరు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పార్టీకి చెడ్డపరు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యల విషయంలో సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?