Pallavi Prashanth: బిగ్బాస్ సీజన్ 7 ప్రారంభమై మొదటి వారం కాబోతోంది. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లలో 8 మంది నామినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే కంటెస్టెంట్లు చాలా వరకు స్ట్రాంగ్ రీజన్స్ లేకపోవడంతో సిల్లీ రీజన్స్ చెబుతూ ఎలిమినేట్ చేసినట్లు అర్థమవుతోంది. ఓటింగ్ కూడా ముగిసినట్లు టాక్. ఈ వారం ఎవరు సేఫ్ అయ్యారో? ఎవరు హౌజ్ నుంచి బయటకు వస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే హౌజ్లో ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్లోనూ లవ్ ట్రాకులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఫస్ట్ నుంచి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా బిగ్బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ లేడి కంటెస్టెంట్ రతిక రోజ్ మధ్య బాండింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. రతిక రోజ్, పల్లవి ప్రశాంత్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని వాళ్ల బిహేవ్ చూస్తేనే అర్థమవుతోంది. పల్లవి ప్రశాంత్.. రతికను ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. రతికా పేరు మూడు అక్షరాలు అయితే.. దాన్ని పల్లవి ప్రశాంత్ ‘రతి’గా చేసి రతికానందం పొందుతున్నాడు.
బిగ్బాస్ హౌజ్లో రతిక లేకపోతే జీవితం లేదన్నట్లుగా పల్లవి ప్రశాంత్ ప్రవర్తిస్తున్నాడు. ఒకసారి పల్లవి ప్రశాంత్ను ఆట సందీప్ డైరెక్ట్గా అడిగేశాడు. నువ్వు బిగ్బాస్ హౌజ్కి వచ్చింది.. గెలవడానికా? రతిక కోసమా? అని. దానికి నవ్వుతూ బదులిచ్చేశాడు. ఒకసారి రతికను నీకో విషయం చెప్పాలని పల్లవి ప్రశాంత్ వెంట పడుతుంటాడు. దానికి రతిక కూడా.. చెప్పేయ్ రా.. చెప్పేయ్.. నీ మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పేయ్’ అంటూ రెచ్చగొడుతుంది. దానికి మనోడు నిజంగానే రతిక తనకు పడిపోయిందని ఊహల్లో తేలిపోతున్నాడు. ఇద్దరూ ఒకే చోట కూర్చోవడం, ఒకరి కళ్లల్లో ఒకరు చూడటం, సిగ్గుపడటం వంటి పనులు చూస్తుంటే హౌజ్లోనే కాదు బయట చూసే ప్రేక్షకులు బిత్తెరపోతున్నారు. రతిక రోజ్ కవ్వింపులను నిజమే అనుకుని పల్లవి ప్రశాంత్ బాగానే పొంగిపోతున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్కు సీజన్కో ప్రేమ జంట కావాలి. ఈ సారి పల్లవి ప్రశాంత్ రూపంలో ఓ బకరా దొరికేశాడని నెటిజన్లు చెబుతున్నారు. రైతు బిడ్డను అని సింపథి డ్రామా ప్లే చేస్తూనే.. లవ్ ట్రాకులు నడుపుతున్నాడు. రతికతో ఒకలా ప్రవర్తించడం.. మిగిలిన వారి దగ్గర అమాయకంగా ప్రవర్తించడంపై తీవ్ర వ్యతిరేకత మొదలైనట్లు తెలుస్తోంది.
దారుణమైన ట్రోలింగ్..
బిగ్బాస్ హౌజ్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ కొంచెం ఓవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది కంటెస్టెంట్లు కూడా కొన్ని విషయాలు మార్చుకోమని చెప్పినా వినింది లేదు. ఎంత సేపు ఆరాధించడం, కెమెరా ముందుకు వెళ్లి అతి చేయడంతోనే సరిపోతుంది. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు వారికి తగ్గట్లే ప్రవర్తించాలి. నలుగురిలో కలిసి తినేటప్పుడు అలానే ప్రవర్తించాలి. కానీ మనోడికి ఉన్న అతితో దారుణంగా ట్రోలింగ్కు గురయ్యాడు. రైతు బిడ్డగా చెబుతూనే అలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. రైతు పడే కష్టాలు చెబుతానంటూ వాగ్ధానాలు చేసి హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. తన వాగ్ధానాలను మరిచినట్లు తెలుస్తోంది. తోటి కంటెస్టెంట్ రతిక రోజ్తో పురిహోర కలపడం, హౌజ్లో ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. హౌజ్లో ఎవరో తిన్నప్పుడు మెతుకులు పడటం గమనించిన ప్రశాంత్.. వాటిని ఏరి ఎవరూ లేని సమయంలో కెమెరా ముందు చూపించి ఎంగిలి మెతుకులు తిన్నాడు.
అన్నం పడేస్తేనే తట్టుకోలేనన్నట్లుగా ప్రవర్తించాడు. చాలా వరకు పల్లవి ప్రశాంత్ బిహేవియర్ ఓవర్గా ఉందని జనాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ప్రశాంత్ తన ప్లేటులో తినగా మిగిలిపోయిన అన్నం, కూరను చెత్త బుట్టలో పడేస్తాడు. అది చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అన్నం పడేయొద్దంటూ హౌజ్లో ఎంగిలి మెతుకులు తిన్న పల్లవి ప్రశాంత్.. బయటేమో ఇంత అన్నాన్ని ఎలా పడేశావ్.. ఇంత ఓవరాక్టింగ్ అవసరమా అంటూ తిట్టుకుంటున్నారు.
Exclusive Bigg Boss 7 Telugu Live Updates and Bigg Boss Related Articles
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!