Guntur Karam TRP: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సంక్రాంతి బరిలో విడుదలైన గుంటూరు కారం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ రివ్యూ లతో రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఒక స్టార్ హీరో సినిమా అయితే మినిమం కలెక్షన్స్ రాబడడం ఖాయం. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఇక ఇప్పుడు టీవీలో ప్రీమియర్ లో ను మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఈ ఏడాది జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజయింది. ఇక తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటిటి లోకి వచ్చింది.
ప్రస్తుతం ఈమధ్య జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ కూడా అయ్యింది. దీనికి 9.23 టిఆర్పి రావడం విశేషం. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలను బట్టి చూస్తే ఇది చాలా మంచి రేటింగ్ ని దక్కించుకుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయిన వాల్తేర్ వీరయ్య, దసరా, జైలర్ వంటి సినిమాల తో పోలిస్తే గుంటూరు కారం టిఆర్పి రేటింగ్ లో చాలా బెటర్. ఈ మధ్య వచ్చిన హాయ్ నాన్న మూవీకి టిఆర్పి కంటే చాలా ఎక్కువే సంపాదించుకుంది గుంటూరు కారం. ఓటీటీలు వచ్చిన తర్వాత టీవీలలో సినిమాలను చూసేందుకు పెద్దగా ఎవ్వరూ ఇష్టపడడం లేదు. పెద్ద హీరో సినిమాలు అయిన రెండంకెల టిఆర్పి అందుకోవడం అసాధ్యం గా మారింది.
ఈ పరిస్థితుల్లో గుంటూరు కారం సుమారు పదికి చేరుగా రేటింగ్ సాధించడం మామూలు విషయం కాదు. ఈ యాక్షన్ రామ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చాలా దారుణంగా ఉందని కొందరు రివ్యూలు ఇచ్చారు. ఇక ఈ ప్రభావం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై పడింది. అయితే తరువాత నెట్ఫ్లిక్స్ లోను ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. చాలా రోజులపాటు టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు టీవీలోనూ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ మూవీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, రాహుల్ రవిచంద్రన్, వెన్నెల కిషోర్ లాంటివాళ్ళు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క టీఆర్పి రేటింగ్ను చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. థియేటర్లో సూపర్ హిట్ అయిన సినిమాలకే ఇంతటి పాపులారిటీ దక్కలేదు. అలాంటిది థియేటర్లలో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఏకంగా ఇంత టిఆర్పి రేటింగ్ నమోదు చేయడంతో ప్రతి ఒక్కరూ షాక్ లో ఉండిపోయారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.