టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుండీ సోషల్ మీడియాలో మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హాట్ ఫోటోషూట్లు, వైవిధ్యమైన పోస్ట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్గా ఉండే సామ్.. ఇలా ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. దానికి తోడు సామ్ అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటోందంటూ రోజుకో వార్త తెరపైకి వస్తోంది.
దాంతో అసలేమైందో అర్థంగాక అభిమానులు తెగ మదన పడిపడుతున్నారు. అయితే ఎట్టకేలకు సమంత మౌనం వీడింది. `యశోద` టీజర్ అప్డేట్ తో మళ్లీ ఆమె సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి హరి, హరీష్ లు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు వినాయక చవితి కావడంతో.. ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ వచ్చింది.
యశోద టీజర్ను సెప్టెంబర్ 9న సాయంత్రం 5:49 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను వదిలారు. ఇదే అప్డేట్ను సమంత సైతం తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మొత్తానికి సమంత మళ్లీ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.