యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, తులసి ముఖ్యమైన పాత్రలను పోషించగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. బ్యూటిఫుల్ ఫీల్గుడ్ మూవీ అని కొందరు రివ్యూలు ఇవ్వగా.. రోటీన్గా ఉందని, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని మరికొందరు పేర్కొన్నారు.
భారీగా `థ్యాంక్యూ` బిజినెజ్.. హిట్ కొట్టాలంటే చైతు టార్గెట్ ఎంత?
ఏదేమైనా లవ్, ఎమోషన్, యాక్షన్ ను టచ్ చేస్తూ వెళ్లిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. `థ్యాంక్యూ` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు దక్కించుకున్నారు.
ఇకపోతే ఇటీవల పెద్ద సినిమాలను ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని కొంత మంది నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అందులో దిల్ రాజు కూడా ఒకరు. ఆ నిర్ణయానికి కట్టబడే `ఎఫ్ 3`ను ఎనిమిది వారం అనంతరం ఓటీటీలో స్ట్రీమ్ చేశారు. ఈ నేపథ్యంలోనే `థ్యాంక్యూ`ను సైతం ఎనిమిది వారాల తర్వాతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేసేలా దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.