Virata Parvam: రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలక పాత్రలను పోషించగా.. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు.
1990 బ్యాక్డ్రాప్లో నక్సలిజం నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవిలు అలరించనున్నారు. గత ఏడదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. అనేక వాయిదాల అనంతరం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘విరాట పర్వం’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాయి పల్లవికి ఉన్న క్రేజ్, మేకర్స్ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాకు భారీ బిజినెస్ జరిగేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే.. రూ. 14.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ టార్గెట్ను రానా-సాయి పల్లవిలు అందుకుంటారో లేదో చూడాలి. ఇక `విరాట పర్వం` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఓసారి గమనిస్తే..
నైజాం: రూ. 4 కోట్లు
సీడెడ్: రూ. 2 కోట్లు
ఆంధ్రా: రూ. 5 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ= రూ. 11 కోట్లు
——————–
కర్ణాటన+రెస్టాఫ్ ఇండియా: రూ. 1.00 కోట్లు
ఓవర్సీ: రూ. 2 కోట్లు
——————–
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్=14.00 కోట్లు
———————