వహ్వా..! చెప్పుకోవాలే గానీ ఏపీలో రాజకీయ చర్చలకు కొదవే ఉండదు. రాజధానులని, పోలవరమని, స్థానిక ఎన్నికలని.. ఇవేమి లేకపోతే టిడికో ఇళ్ళని పేదలకు ఇవ్వాలనో.., ఇళ్ల పట్టాలనో గొడవలు చేస్తూనే ఉంటారు. వీటి మధ్య నిమ్మగడ్డ నేనున్నానంటూ తెరపైకి వస్తూ ప్రభుత్వంతో కత్తులు దూస్తుంటారు. స్థానిక ఎన్నికల పరిణామాలు చర్చించే ముందు ఓ సారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎం జగన్ ఇలా ఇద్దరి లోపల నెలకొన్న ఆరాటం, భయం.. తలదన్నే వ్యూహం ఓ సారి చెప్పుకోవాల్సిందే..!
నిమ్మగడ్డ ఏమనుకుంటున్నారంటే..!!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్. గత ఏడాది మర్చి వరకు ఎవరికీ తెలియని పేరు. నాయకులూ, జనమూ, రాజకీయులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఎన్నికలు ఉంటేనే ఆయనకు చేతి నిండా పని. లేకపోతే గోళ్లు గిల్లుకోవడమే. అందుకే గత ఏడాది గట్టిగా పని చేయాలి అనుకునే సమయానికి కరోనా వచ్చి పడింది. ఈ కరోనా సమయానికి ముందే వైసీపీ స్థానిక సమరంలో దున్నేస్తుంది. స్థానిక ఏకగ్రీవాలు పేరిట హవా చాటుతుంది. ఇక పిర్యాదులు, ఆరోపణలు, వివాదాలు, అంతకు మించిన సొంత అవకాశాలతో విసిగిపోయిన నిమ్మగడ్డకి కరోనా దొరికింది. ఇక ఎన్నికలు ఆపేసారు. దీంతో జగన్ కి కోపం వచ్చింది. ఎడాపెడా ఏకి పారేసి.., ఆర్డినెన్సు తెచ్చేసి నిమ్మగడ్డని తొలగించేసారు. కానీ చట్టం ముందు నిలబడలేదు. నిమ్మగడ్డ మళ్ళీ అదే కుర్చీలోకి వచ్చేసారు. ఇక మొదలెట్టారు తన రాజకీయం..!!
స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే తన పగ..!!
ఏమో ఏమైనా అంటే రాజ్యాంగ వ్యవస్థలు.. మా పని మాది అంటారేమో..!! కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే… నిమ్మగడ్డ కూడా ఒక మనిషే. పైగా ఒక హోదా, స్థాయి ఉంది. ఆయనకు పగలు, ప్రతీకారాలు ఉంటాయి. భక్తులు, విశ్వాసాలు, ఆశీస్సులు కూడా ఉంటాయి. అందుకే సీఎం పవర్ చూపించి.., ప్రయోగించి.., తనను తొలగించిన జగన్ కి తాను ఏమిటో.., తన పవర్ ఏమిటో చూపించాలని ఉంటుంది కదా..!? అది జరగాలి అంటే స్థానిక ఎన్నికలు జరగాల్సిందే కదా..!? సో.., అక్కడ మొదలయింది వివాదం. స్థానిక ఎన్నికలు నిర్వహించి, తాను పని చేసుకుంటాను అని నిమ్మగడ్డ.., అసలు నీకు ఆ అవకాశం ఇవ్వను అంటూ సీఎం జగన్ రెండో దశ పోరుకి తెరతీశారు. ఏది ఏమైనా.., తాను హోదాలో ఉన్నప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.., తన పని పవర్ చూపించాలి అనేది నిమ్మగడ్డ ఆరాటం. దీనిలో కొన్ని భయాలున్నాయి. తనకు ఇంకో 6 నెలలు మాత్రమే సమయం ఉండడం. తాను బీజేపీ నేతలతో ఓ హోటల్ లో కలిసి దొరికిపోవడం.., రాజకీయాల్లో ఒక వర్గంతో కలిసి ఉన్నారనే అపవాదు మూటగట్టుకోవడంతో తాను ఎంతగా “చట్టం, రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ.., ఈయన వెనుక పార్టీ, నాయకుడు అనేది బయటకు తెలిసిపోతుంది” అదే నిమ్మగడ్డ భయం కూడా..!
పట్టు పోతే మళ్ళీ దొరకదు..!
మరి సీఎం జగన్ కూడా ఓ ఆరాటం, భయం మధ్య ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కి స్థానిక ఎన్నికల అవకాశం ఇస్తే తనకు మాట పోతుంది. తన పార్టీకి ఇబ్బందులు తప్పవు. పాత గొడవలు, పాత ఆర్డినెన్సులు దృష్టిలో పెట్టుకుని నిమ్మగడ్డ ఇబ్బందులు పెడతారు. అందుకే ఆయన ఉండే వరకు స్థానిక ఎన్నికలు అవసరం లేదు అనేది జగన్ ఆరాటం. ఒకవేళ పెడితే తాము నష్టపోతాం అనేది భయం. అందుకే ఒక వ్యూహంతో వెళ్తున్నారు. నిమ్మగడ్డ కోర్టుల ద్వారా వస్తుంటే.., సీఎం జగన్ తన అధికారులు ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా ఏం చేయాలో.., ఎలా చేయాలో జగన్ కి తెలుసు. సుప్రీమ్ లో అపీల్ వేయడం.., అది ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగుతాయ్. “మేము కరోనా విధుల్లో ఉన్నాం, స్థానిక ఎన్నికలకు సహకరించలేం అని పిటిషన్ వేస్తాయ్. ఇలా అయిదు నెలలు ఆపితే చాలు జగన్ గెలిచినట్టే. నిమ్మగడ్డ దిగినట్టే. అందుకే ఎవరి వ్యూహంతో వారు ఈ తెరని నడిపిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?