నాటి హైకోర్టు తీర్పు పై సుప్రీంను ఆశ్రయించిన ఉండవల్లి
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఛాన్స్ వచ్చిందా..
నాడు వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారం ఇప్పుడు మరో సారి తెర మీదకు వచ్చింది. నాడు వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గుట్టుగా సాగుతున్న మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇది నిబంధనలకు ఉల్లంఘిస్తూ జరిగిన విషయం కావటంతో కోర్టుకు చేరింది.
ఆ సమయంలోనే రామోజీరావు తన సంస్థల్లో షేర్లను ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు విక్రయించి నిధులు సమీకరించుకొని మరీ..డిపాజిట్లను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ కేసును అప్పట్లో హైకోర్టు కొట్టి వేసింది. తిరిగి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం ని ఆశ్రయించారు. సుప్రీం నోటీసులు జారీ చేసింది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం తిరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది.
సుప్రీంలో మార్గదర్శి వ్యవహారం..
నాడు ఉమ్మడి ఏపీలో ఈనాడు గ్రూపు సంస్థల్లో ఒకటైన మార్గదర్శి ఫైనాన్స్ నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయాన్ని అప్పటి ఎంపీ ఉండవల్లి వెలుగులోకి తేవటం..న్యాయ పోరాటానికి దిగటం సంచలన అంశంగా మారింది. దీని పైన రాజకీయంగానూ దుమారం చెలరేగింది. రామోజీ రావు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయలు రామోజీరావు డిపాజిట్లు సేకరించారని ప్రధానంగా ఫిర్యాదు సారాంశం. దీంతో….అప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకున్న రామోజీ తన గ్రూపులోని కొన్ని సంస్థల షేర్లను విక్రయించి ఆ మొత్తాన్ని సమీకరించి..డిపాజిట్ దార్లకు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అయితే, అప్పుడు ఆ కేసును హైకోర్టు కొట్టి వేసింది. కానీ, ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు తిరిగి ఉండవల్లి మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం ని ఆశ్రయించారు. ఉండవల్లి పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. రామోజీరావు , మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. కేసులో ఆర్.బి.ఐ , మాజీ ఐజి కృష్ణంరాజును ఇంప్లీ డ్ చేసేందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలకు సైతం సుప్రీం నోటీసులు..
అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్నిఇప్పుడు ఉండవల్లి ప్రధానంగా తన పిటీషన్ లో ప్రస్తావించారు. రామోజీ..మార్గదర్శితో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బిఐ, కృష్ణంరాజు లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయలు రామోజీరావు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజి కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఈ కేసు కొనసాగుతోంది. హెచ్ యు ఎఫ్ వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని రామోజీపై కేసును ఉమ్మడి హైకోర్టు విభజన కు ఒక రోజు ముందు జస్టీస్ రజిని కేసు కొట్టివేసారు. పిటిషనర్ ఉండవల్లి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ వాదించారు. అయితే, అనేక సందర్భాల్లో చంద్రబాబుు మద్దతుగా రామోజీ కి చెందిన ఈనాడు పత్రిక పని చేస్తుందనే ఆరోపణ అటు తెలంగాణ..ఇటు ఏపీ అధికార పార్టీల నేతలు విమర్శించారు. ఇక, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ఇవ్వటంతో ఈ కేసులో అటు కేసీఆర్..ఇటు జగన్ ఏ రకంగా స్పందిస్తారు..ఈ కేసులో వారి స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!