Milk: ప్రతిరోజు పాలు తాగడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో. ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం పాలు తాగడానికి పెద్దగా ఆసక్తి చూపరు.కానీ ఒక గ్లాసు వేడి. పాలలో ఒక చిటికెడు సోంపు గింజలు వేసుకుని తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే సోంపు గింజల్లో సెలీనియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.మరి వేడి పాలలో సోంపు గింజలు వేసుకుని తాగితే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వేడి పాలలో సోంపు గింజలు వేసుకుని తాగితే మంచిదేనా..?
వేడి పాలలో కొద్దిగా సోంపు గింజలు వేసుకుని తాగితే జీర్ణ సమస్యలు అనేవి తగ్గిపోతాయి.సోంపులో ఉండే చల్లటి, తియ్యని గుణాలు జీర్ణ వ్యవస్తను బలోపేతం చేసి త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.అలాగే ఎముకలు దృడంగా, పటిష్టంగా ఉండాలంటే పాలలో సోంపు సోంపును కలిపి తాగాలి.ఎందుకంటే సోంపు, పాలు రెండిటిలోనూ కాల్షియం, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి కావున ఇవి రెండు కలిపి తాగితే ఎముకలు బలంగా తయారు అవుతాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రక్తహీనతను దూరం చేసే సోంపు పాలు :
ఆడవాళ్లు నెలసరి సమయంలో రక్తహీనత సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో సోంపు కలిపిన పాలను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.సోంపులో ఉండే ఐరన్ వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. వీటిల్లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కంటి సమస్యలు ఉన్నవాళ్లు సోంపు పాలు తాగితే చాలా మంచిది.ఎందుకంటే కంటి చూపుకు సోంపు గింజలు అద్భుతంగా పని చేస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.