మనం ఆరోగ్యంగా ఉండాలని ఆహారం తీసుకుంటాం. అంతేకానీ మనం తీసుకున్న ఆహారం ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఎవరూ గమనించరు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా పూర్తి ఆహారపు అలవాట్లను కూడా మార్చేస్తున్నారు. దీనివల్ల, ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం మన జీవన విధానాన్ని నిర్దేశిస్తోంది. అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే.
ఉదయం తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర లేవగా మొహం కడిగి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కి కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలోని భాగాలు శుద్ధి చేయబడతాయి. ప్రతి రోజు ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మన శరీరంలోని కొవ్వు చెమట రూపంలో బయటకు వెళుతుంది.
ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, ఇడ్లీ, దోస వంటివి తీసుకోవాలి. కాఫీ టీలకు బదులుగా, గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం మంచిది. లేదా ఒక గ్లాసు పండ్ల రసం తాగడం వల్ల అధిక శక్తిని కలిగిస్తుంది. ఒక గంట ఆగిన తర్వాత ఏదైనా పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో వీలైనంతవరకు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం, అధిక మోతాదులో కూరగాయలు, మీగడ లేని పెరుగును తీసుకోవాలి.
భోజనం అయ్యాక ఒక అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. అలాగేతిన్న వెంటనే నిద్రపోకూడదు. సాయంత్రం స్నాక్స్ గా ఏవైనా పండ్లు లేదా ఉడకబెట్టిన గింజలను తీసుకోవాలి దీనితో పాటు తక్కువ పరిమాణంలో ఒక కప్పు టీ తాగవచ్చు. రాత్రి భోజన సమయంలో ఒక చపాతీ లేదా కొద్దిగా రైస్ మాత్రమే తీసుకోవాలి. అదికూడా పడుకోవడానికి గంట ముందు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇలాంటి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
వీలైనంతవరకు మైక్రోఓవెన్ లో చేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఇందులో చేయడంవల్ల ఆహారంలో ఉన్న పోషక పదార్థాలు మొత్తం నశించిపోతాయి. అలాగే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ల ను వీలైనంత వరకు తగ్గించాలి. వీటి ద్వారా అధిక బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి. చూశారు కదా! ఈ ఆహారాన్ని తీసుకోండి.. ఆరోగ్యంగా.. యవ్వనంగా కనిపించండి!