Diabeties: పనస పండు చూడడానికి భయంకరంగా ఉన్న దాని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి.. ఈ పండు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఈ పండు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. పనస పండు ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ తింటారు.. ఈ పండు లోనే కాకుండా గింజల్లో కూడా బోలెడు పోషక విలువలు ఉన్నాయి.. డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి పనస పండు అద్భుతంగా పనిచేస్తుంది.. పనసపండు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..!!
Diabetes: పనస పండు ఇలా తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి..!!
పనస పండు లో యాసిడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి . అందువలన మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండు తీసుకోవచ్చు. ముఖ్యంగా అన్నానికి బదులు పనస పండ్లను తింటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పండులో సహజసిద్ధమైన చక్కెర్లు ఉన్నాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇవి తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి అని కనిపించే మధుమేహం రోగులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
పనసపండు శరీరంలోని గ్లూకోజ్, ఇన్సులిన్, గ్లిసేమిక్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనివలన రక్తంలోని చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. మధుమేహం రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం సమస్య తో బాధపడేవారు వీటిని తిన్నా ఎలాంటి సమస్యలు ఉండవు.
Diabetes: పనసపండు ప్రత్యేకతలు..!!
పనస పండులో ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్ క్యాన్సర్ కారక కణాల కు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీనిలో ఖనిజాలు అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రుగ్మతల బారి నుండి కాపాడుతుంది. దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటు నుండి కాపాడుతుంది. శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి పనస పండు గొప్ప వరంగా చెప్పవచ్చు. దీనిలో ఉండే పోషకాలు, విటమిన్స్ , మినిరల్స్ రక్తహీనత అధిగమించేలా చేస్తుంది. ఈ పండులో ఉన్న కాల్షియం శరీరంలోని ఎముకల ను దృఢంగా ఉంచుతుంది. ఎముకలు పెలుసు బారకుండా చూస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది. కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మృతకణాలను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది. పనసతొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వీర్యవృద్ధిని కలిగించి అంగస్తంభన సమస్యల్ని తగ్గిస్తుంది. శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
పనస పండే కాకుండా పనస గింజలు వలన కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. పనస పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకొని, ఆ పొడిని తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి.