అనుకోని కారణాల వల్ల చాలా మంది విరేచనాలు చేసుకుంటారు. దానితో వారి శరీరం నీరసంగా మారుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి మరి..లూజ్ మోషన్స్ లేదా, డయేరియా వల్ల కడుపులో నొప్పిగా ఉంటుంది. దాంతో ఆగకుండా మాటిమాటికీ బాత్రూమ్ కు పరిగెత్తాల్సి వస్తుంది. దాంతో మనిషి నిరసంగా మారతాడు. ఇదిలా ఉంటే లూజ్ మోషన్స్ తో శరీరంలో నుండి నీరు ఎక్కువ క్వాంటిటీస్ లో పోతుంది. దీనివలన డీహైడ్రేషన్ కి గురి కావచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని తెలుపుతున్నారు నిపుణులు. మరి అవేంటో చూసేయండి..
డయేరియాతో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ అరటి పండు. దీనిలో ఉండే పొటాషియం అరుగుదలకి సహకరిస్తుంది. అలాగే మోషన్స్ ను కూడా నియంత్రిస్తుంది. పెరుగు కూడా విరేచనాలను అదుపులో ఉంచడానికి ఎంతో సహకరిస్తుంది. ఫుడ్ ఈజీగా అరగడానికి సహకిస్తుంది. ఫలితం గా డైజెషన్ బాగా జరుగుతుంది. అలాగే చెక్కు తీసిన యాపిల్స్ కూడా ఈ సమస్య కి బాగా హెల్ప్ చేస్తాయి. ఓట్స్ కూడా వాంతులను, విరేచనాలను నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి.
వీటితో పాటుగా కొబ్బరి నీరు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్ బాడీలో ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ ని సరి చేసి లూజ్ మోషన్స్ వల్ల నష్టపోయిన నీటి శాతాన్ని పెంచుతుంది. లూజ్ మోషన్స్ ను నియంత్రించడంలో జీలకర్ర నీరుకూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కప్పు నీరు తీసుకుని టీ స్పూన్ జీల కర్ర వేసి కొన్ని నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తరువాత వడకట్టి తాగేయండి.
అలాగే మజ్జిగ డైజెస్టివ్ సిస్టమ్ ని బాగుచేస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపేస్తుంది. అలాగే కొద్దిగా మునగాకు రసాన్ని తేనెతో కలిపి వెంటనే తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ని ఎఫెక్టివ్ గా సాల్వ్ చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోకూడదు. అందులో ముఖ్యంగా పాలు, పన్నీర్, చీజ్, బటర్ ను పూర్తిగా ఎవాయిడ్ చేయాలి. కాఫీ, టీ తీ కూడా తీసుకోకపోవడం మంచిది. అలాగే వేపుళ్ల పదార్థాలు కూడా తినకూడదు. పండ్ల రసాలు కూడా తీసుకోకపోవడం మరీ మంచిది. ఈ కథనం కేవలం నిపుణులు సూచించిన ప్రకారమే అందించాం. ఏదైనా సమస్య ఎదురైతే వైద్యులను సంప్రదించడం మంచిది.