CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్ గా మహారాష్ట్ర మాజీ పోలీస్ డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులైయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
సీబీఐ కొత్త బాస్ ఎంపికపై నిన్న రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కమిటీ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది. ఈ ముగ్గురిలో వడపోత అనంతరం చివరకు సుభోద్ కుమార్ ను కమిటీ ఖరారు చేసింది. కమిటీ సిఫార్సు మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జైస్వాల్ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన 1985 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన సీఐఎస్ఎఫ్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
IPS Subodh Kumar Jaiswal has been appointed as Director of Central Bureau of Investigation (CBI) for a period of 2 years pic.twitter.com/jFGwZbOen4
— ANI (@ANI) May 25, 2021