YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబును చంద్రముఖి సినిమాలో పశుపతిలా పోల్చారని, ఇంటింటికీ పింఛను అందకుండా చేసి 31 మంది అవ్వాతాతలను చంద్రబాబు చంపారంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఇటీవల సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబుపై దురుద్దేశ పూర్వకంగా సీఎం వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను కూడా ఫిర్యాదుతో జత చేశారు. వీటిని పరిశీలించిన సీఈఓ .. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ కు నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లోగా వివరణ రాకపోతే చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
CM Revanth Reddy: ఆ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే పాయె..