(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజధాని ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసే వైసీపీ నేతలు ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత కూడా పాత ఏడుపులేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘అయ్యా విజయసాయి రెడ్డి గారూ.. అధికారంలోకి వచ్చిన 7 నెలల తరువాత కూడా పాత ఏడుపులేనా? అమరావతిలో వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ట్వీట్లు మాని మీకు, జగన్ గారికి దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టమనండి. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు బురద చల్లడం ఒక్కటే మీ పని అనుకుంటే మీ ఇష్టం విజయసాయిరెడ్డి గారూ’ అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా కాదు డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోనే చర్చించుకుందామని, సమయం, తేదీ మీరే నిర్ణయించండని సవాలు విసిరారు.
ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు బురద జల్లడం ఒక్కటే మీ పని అనుకుంటే మీ ఇష్టం విజయసాయిరెడ్డి గారు. మీరు చేస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా కాదు డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోనే చర్చించుకుందాం. సమయం, తేదీ మీరే నిర్ణయించండి సాయి రెడ్డి గారు.(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 20, 2019
రైతులంతా ఆధార్ కార్డులు, భూమి పత్రాలు పట్టుకొని విజయసాయిరెడ్డి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సిగ్గు లేకుండా రైతులను పెయిడ్ ఆర్టిసులు అని అవమానపరుస్తారా? అంటూ మండిపడ్డారు. మిమ్మల్ని రైతు లోకం క్షమించదని తెలిపారు. ‘రైతులకు పార్టీ రంగు పూసి రాక్షస ఆనందం పొందుతారా? వైకాపాకి మద్దతు పలికిన రైతులు కూడా మీ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. మీకు ఓటు వేసిన వారిని కూడా పెయిడ్ ఆర్టిసులు అని అవమానించే కుసంస్కారం మీది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతులకు పార్టీ రంగు పూసి రాక్షస ఆనందం పొందుతారా? వైకాపాకి మద్దతు పలికిన రైతులు కూడా మీ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. మీకు ఓటు వేసిన వారిని కూడా పెయిడ్ ఆర్టిసులు అని అవమానించే కుసంస్కారం మీది.(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 20, 2019
రాజధాని ప్రకటనకి ముందే రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రకటన వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్లు మొదలుపెడతారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే జగన్ పాలన వచ్చిన తరువాత విశాఖలో భూముల అక్రమాలపై సిట్ విచారణకి అంగీకరించాలని డిమాండ్ చేశారు.
రాజధాని ప్రకటనకి ముందే రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇప్పుడు ప్రకటన వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్లు మొదలుపెడతారు. విజయసాయిరెడ్డి గారికి దమ్ముంటే జగన్ గారి పాలన వచ్చిన తరువాత విశాఖలో భూముల అక్రమాలపై సిట్ విచారణకి అంగీకరించాలి.(2/2)
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 20, 2019