గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ఆ పార్టీ అధినేత చేపట్టారు. ముందుగా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలు పై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఒకప్పుడు రాయలసీమ టీడీపీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా తిరగబడింది.గత ఎన్నికల్లో సీమలోని నాలుగు జిల్లాల్లో కలిపి 8 ఎంపీ సీట్లు, 52 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క ఎంపీ సీటూ గెలవని టీడీపీ, మొత్తంగా మూడే మూడు ఎమ్మెల్యే సీట్లుగెలుచుకుంది. అందులోనూ చంద్రబాబు, బాలయ్యను వదిలేస్తే పయ్యావుల కేశవ్ ఒక్కడే ఉరవకొండలో గెలిచారు. ఇది ఘటన అనుకుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలోని రెండు జిల్లాలు మీద ఆశలు లేవట. సీఎం సొంత జిల్లా అయిన కడప లో టిడిపి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
ఇంకా చెప్పాలంటే 2004 నుంచే కడపతో టీడీపీ బంధం పోయింది. 2009, 2014 ఎన్నికల్లో కనీసం ఒక సీటు అయినా టీడీపీ గెలిస్తే.. గత ఎన్నికల్లో జిల్లాలో అసలు పార్టీ ఖాతాయే తెరవలేదు. కడపలో ఐదారుపార్టీకి బలమైన నేతలే లేని పరిస్థితి. ఇక, కర్నూలులో అంతో ఇంతో ప్రభావం ఉంటుందని అనుకున్నా.. సీనియర్లు ఎవరూ పార్టీని నడిపించేందుకు ముందుకు రాలేని పరిస్థితి.
2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే అక్కడ మూడు సీట్లు గెలిచిన టీడీపీగత ఎన్నికల్లో సున్నా చుట్టేసింది. కర్నూలులో గత ఎన్నికల్లో చాలా మంది వారి వారి వారసులను రంగంలోకి దింపారు. వీరంతా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ కనుచూపు మేరలో కూడా చాలా నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు.కాబట్టి కర్నూలు జిల్లా పై కూడా టిడిపి పెద్దగా ఆశలు లేవు అనంతపురం జిల్లా మాత్రం నిన్నటి వరకు ఆ పార్టీకి కంచుకోట.
అయితే జేసీ వంటి నేతలు కేసుల్లో పడి కొట్టుమిట్టాడుతుంటే, పరిటాల ఫ్యామిలీ ప్రజల్లోకే రాని పరిస్థితి ఉంది. దీంతో అనంతపురంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులే చంద్రబాబుకి కనిపిస్తున్నాయి. ఇక, చిత్తూరులో ప్రస్తుతమున్న నియోజకవర్గాలను కాపాడుకుంటూనే తమకు ప్రాధాన్యం లేని చోట్ల ఎదగాలని నిర్ణయించుకున్నారట. మొత్తంగా చూస్తే టీడీపీ రాయలసీమలో రెండు జిల్లాల్లో పూర్తిగా వదులుకొని మిగిలిన రెండు జిల్లాల పైన కొద్దిగా ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.