గత శనివారం నుండి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం లో ఓ వింతైన వ్యాధి వలన ప్రజలు కళ్ళు తిరిగి పడిపోవడం తో పాటు ఫీట్స్ తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి మూలకారణం ఏంటో అన్నది వైద్యులు కూడా ఇప్పటివరకు తేలకపోవడంతో ప్రజలలో ఆందోళనలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ఏలూరు మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ వ్యాధి లక్షణాలతో చాలామంది కళ్లు తిరిగి పడిపోవడం తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొంతమంది పట్టణాన్ని విడిచి బంధువుల ఇళ్లకు వెళ్లి పోతున్నారు. అయితే ఈ వ్యాధికి గల మూల కారణం ఏమిటో తెలుసుకోవడానికి కేంద్ర వైద్య బృందాలతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా ఏలూరు పట్టణానికి రావటం జరిగింది.
ఇదిలా ఉండగా హెవీ మెటల్ తరహాలో ప్రమాదకరమైన లోహం వల్ల నీళ్లు కలుషితం అయినట్లు అందువల్లే ప్రజలు మూర్చిల్లి పడిపోతున్నారనే వార్త జిల్లాలో వినబడుతుంది. అయితే ఏ కారణం వల్ల వచ్చింది అన్నది ఇంకా స్పష్టత రాలేదు. శనివారం ఆదివారం సోమవారం కేసులు భారీగా రాగా.. మంగళవారం తగ్గుముఖం పట్టడంతో జిల్లా వైద్య యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. అటు ఏలూరు లో వింత వ్యాధి విషయంలో కేంద్ర వైద్య బృందాలు పట్టణానికి వచ్చిన గాని సరైన స్పష్టత రాకపోవడంతో.. ప్రధాని మోడీ ఈ విషయంలో టెన్షన్ పడుతున్నట్లు జాతీయ మీడియాలో టాక్ వస్తోంది. ఉండే కొద్ది కేసులు పెరిగితే ఏలూరు సిటీని నిర్బంధించే అవకాశం ఉందన్న టాక్ కూడా మీడియాలో వినబడుతుంది. మూడు రోజుల వ్యవధిలోనే ఐదు వందల కేసులు అంటే మామూలు విషయం కాదు పైగా ఇది వైరస్ వల్ల అయితే కరోనా కంటే డేంజర్ అవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏలూరు వింత వ్యాధి విషయంలో కారణం బయటకు రాకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.