వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి దాదాపు గంట పాటు చర్చలు జరపడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం గురించి అదేవిధంగా పోలవరం పెండింగ్ నిధులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని అమిత్ షా ని జగన్ కోరడం జరిగిందట.
అంత మాత్రమే కాక దిశ చట్టం, స్పెషల్ స్టేటస్, కొత్తగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజీలకు సంబంధించిన అనుమతులు ఇంకా రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల గురించి ఈ సమావేశంలో జగన్ చర్చించడం జరిగిందట. ఇదిలా ఉండగా బుధవారం నాడు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ తో సీఎం జగన్ భేటీ అవ్వటం సంచలనం అయ్యింది.
ఏపీ సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్లైంట్ చేసిన సందర్భంలో ఈ భేటీ జరగటం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాకుండా ఏపీలో కొత్తగా ప్రారంభించబోయే ప్రాజెక్టుల గురించి కూడా ఈ సమావేశంలో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర జల శక్తి మంత్రి తో భేటీ అయిన తర్వాత ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీ నుండి గన్నవరానికి బయలుదేరారు సీఎం జగన్. దాదాపు రెండు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యింది.