Sharwanand: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా శర్వా కెరియర్ కొనసాగుతోంది. నేడు శర్వానంద్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన నటించే మూడు సినిమాల అప్ డేట్ లు ప్రకటించడం జరిగింది. వీటిలో ఒకటి యూవీ క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి దర్శకుడు. గతంలో “లూజర్” అనే వెబ్ సిరీస్ అందించడం జరిగింది. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్ గా కనిపించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో బైకర్స్ రేసింగ్ లో ధరించుకునే దుస్తులతో శర్వానంద్ బ్యాక్ చూపించడం జరిగింది.
దీంతో బైక్ రేస్ నేపథ్యంలో సినిమా గతంలో ఇదే తరహాలో మైత్రి సంస్థ విజయ్ దేవరకొండతో… ఓ భారీ సినిమా ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా బాగా ఖర్చు చేశారు. కానీ ప్రాజెక్టు మధ్యలోనే ఆపేశారు. కానీ యూవీ క్రియేషన్స్ మాత్రం ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో ఇదే బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో “రన్ రాజా రన్” అనే సినిమా శర్వానంద్ చేశారు. “రన్ రాజా రన్” సూపర్ డూపర్ హిట్ అయింది. మరొకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో సినిమా చేస్తున్నారు.
“మనమే” అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తండ్రి కూతురు నేపథ్యంలో సినిమా స్టోరీ ఉండనున్నట్లు పొస్టర్ బట్టి అర్థమవుతుంది. శర్వా పుట్టినరోజు సందర్భంగా మనమే టైటిల్ ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేశారు. శర్వానంద్ కెరియర్ లో గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శ్రీకారం, ఒకే ఒక్క జీవితం వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు తెలుగులో 34 సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.